
పుల్కల్, వెలుగు: కుల మతాలకు అతీతంగా ఉర్సు నిర్వహిస్తున్నామని దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబిద్ హుస్సేన్ సత్తారుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గ్రామంలోని దర్గా వద్ద రెండు రోజులుగా హజరత్ మహమ్మద్ బాబాన్ షా వలీ దాదా హజాద్ ఉర్సు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం పీఠాధిపతిని ఇంటి నుంచి ఒంటెలు, గుర్రాలపై కూర్చోబెట్టి బ్యాండ్ మేళాలతో గ్రామ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు.
భక్తులతో కలసి ఆయన దర్గా వద్దకు చేరుకొని గంధం సంధాల్, రోజ్ వాటర్, గులాబీ పువ్వులతో దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించగా 18 టీములు పాల్గొన్నాయి. విజేతలుగా నిలిచిన సంగారెడ్డి, సింగూర్ యువ చైతున్య టీంలకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా రెడ్డి, దర్గా పీఠాధిపతి బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టేకుర్ దర్గా ఇంతియాజ్ సాహెబ్, జహీరాబాద్ దర్గా హరుణ్ సాహెబ్, బోడ్మట్ పల్లి హషం సాహెబ్, సద్దాం సాహెబ్ కర్నాటక, గౌస్ సాహెబ్ కర్నాటక పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో గోవర్ధన్, రామచందర్ రెడ్డి, అంజయ్య, సంగమేశ్వర్, వీరారెడ్డి, గంగారాం, మధుసూదన్, నాగరాజు, దత్తు, వెంకట్, విజయ్,చెన్నాగౌడ్, శేఖర్, యాదయ్య, దర్గా కమిటీ మెంబెర్స్ సయ్యద్ అజ్మత్, నఖీబ్, ఖయ్యుమ్, ఇస్మాయిల్ సింగూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.